హైదరాబాద్’లో ఇళ్ల రేట్లు పెరిగాయ్

కరోనా కాలంలోరియల్ ఎస్టేట్ డమాల్ అయింది. అయితే  గృహ మార్కెట్‌లో ప్రస్తుతం గిరాకీ పెరుగుతోంది. దక్షిణ భారత దేశంలోని హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలోనూ గృహ మార్కెట్ పెరుగుతోందని ప్రాప్‌టైగర్‌ నివేదిక తెలిపింది.

విక్రయాలతో పాటు, నూతన ప్రారంభాలూ అక్టోబరు-డిసెంబరు 2020లో కనిపించాయని పేర్కొంది. దేశంలో ప్రారంభమైన కొత్త ప్రాజెక్టులలో ఈ మూడు నగరాల్లోనే 43 శాతం వరకు ఉన్నాయని, అమ్మకాల పరంగానూ 29శాతం వరకు ఇక్కడే కనిపించాయని తెలిపింది. మిగతా అన్ని నగరాల్లో ధరలు తగ్గుతుంటే.. హైదరాబాద్‌లో మాత్రం ధరల్లో వృద్ధి కనిపిస్తోందని తెలిపింది.