శృతిహాసన్ పూర్తిస్థాయిలో సంతృప్తిపరచలే.. !

పవన్ కల్యాణ్-శృతిహాసన్ జంటని మరోసారి తెరపై చూడాలని అభిమానులు ఆశపడ్డారు. వారి ఆశలని వకీల్ సాబ్ తీర్చబోతున్నాడు. ఇందులో శృతిహాసన్ హీరోయిన్ అంటే.. పవన్ అభిమానులు ఖుషి అయ్యారు. కానీ శృతిహాసన్ పూర్తి స్థాయిలో అభిమానులని సంతృప్తిపరచడం లేదు. వకీల్ సాబ్ లో శృతి ఉంది. కానీ ఆమెది ఫుల్ లెత్త్ సినిమా రోల్ కాదట. జస్ట్ గెస్ట్ రోల్. ఈ విషయాన్ని స్వయంగా శృతినే తెలిపింది.

“వ‌కీల్ సాబ్‌లో నేనూ న‌టించా. నేను హీరోయిన్ అని చెప్ప‌లేను. అతిథి పాత్ర అనుకోవాలి. కాసేపే ఉంటాను. కానీ నా పాత్ర‌ని తీర్చిదిద్దిన విధానం ఆక‌ట్టుకుంటుంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ తో న‌టించే అవ‌కాశం ఎప్పుడు వ‌చ్చినా వ‌దులుకోను” అని శృతి చెప్పింది.ఇక రవితేజ-శృతిహాసన్ జంటగా నటించిన ‘క్రాక్’ ఈ సంక్రాంతికి విడుద‌లైన టాక్ కొట్టేసింది.