హార్ధిక్ పాండ్యా ఇంట్లో విషాదం

టీమ్‌ఇండియా ఆటగాళ్లు హార్దిక్‌ పాండ్య, కృనాల్‌ పాండ్య ఇంట్లో విషాదం నెలకొంది. వీరి తండ్రి హిమాన్షు పాండ్యా ఈ ఉదయం కన్నుమూశారు. హిమాన్షు పాండ్యకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.

హార్దిక్‌ గతనెలలోనే ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల క్రికెట్‌ ఆడాక తిరిగి భారత్‌కు చేరుకున్నాడు. కృనాల్‌ బరోడా తరఫున సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 ట్రోఫీ ఆడుతున్నాడు. తండ్రి మృతి వార్త తెలియగానే బయోబబుల్‌ వదిలి ఇంటికి చేరుకున్నాడు. పలువురు క్రికెట్ ప్రముఖులు హిమాన్షు మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు.