రాజమౌళి-మహేష్ సినిమా స్టోరీ లైన్ లీకు !


దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా దాదాపు ఫిక్సయింది. ప్రస్తుతం రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో బిజీగా ఉన్నారు. షూటింగ్ దాదాపు పూర్తి కావొస్తోంది. వేసవిలో ఆర్ ఆర్ ఆర్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాయి. ఈ సినిమా తర్వాత మహేష్ తోనే రాజమౌళి సినిమా ఉండనుందని తెలుస్తోంది. కరోనా లాక్ డౌన్ టైమ్ లోనే మహేష్ కోసం కథని రాశారని.. పూర్తి స్క్రిప్ట్ కూడా పూర్తయిందని సమాచారమ్. తాజాగా ఆ స్టోరీ లైన్ ఏంటీ ? అన్నది కూడా లీకైంది.

మహేష్ ని ఛత్రపతి శివాజీగా చూపించబోతున్నాడట జక్కన్న. అమ్మ సెంటిమెంట్ ని రాజమౌళి అద్భుతంగా చూపిస్తారన్న సంగతి తెలిసిందే. ఛత్రపతి, బాహుబలి సినిమాల్లో అమ్మ పాత్రలని మలిచిన విధానం సూపర్భ్. ఇక ఛత్రపతి శివాజీ జీవితం గురించి చెప్పాలంటే.. అమ్మ గొప్పదనం, అమ్మ నేర్పించిన దేశభక్తి, అమ్మకు ఇచ్చిన మాటని శివాజీ నిలబెట్టిన తీరుని చూపించొచ్చు. ఇప్పుడీ అంశాలను రాజమౌళి తనదైన స్టయిల్ లో తెరపైకి తీసుకురానున్నాడని తెలుస్తోంది. ఈ  సినిమా సెట్స్ కోసం డిజైన్ కూడా  మొదలెట్టినట్టు సమాచారమ్. ఇదే నిజమైతే..  మహేష్ కెరీర్ లో ఓ అద్భుతమైన సినిమాకి పునాది పడినట్టే.