కరోనా వాక్సీన్ తీసుకున్న వ్యక్తి మృతి

దేశ వ్యాప్తంగా శనివారం నుంచి కరోనా వాక్సిన్ పంపిణీ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా వాక్సిన్ తీసుకున్న వారిలో కొందరికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని చెబుతున్నారు. దురద వస్తుంది. స్వలంగా జ్వరం కూడా ఉంటుందని చెబుతున్నారు. కరోనా వాక్సిన్ తీసుకున్న మరుసటి రోజే యూపీలో ఓ వ్యక్తి మృతి చెందడం ఆందోళ కలిగిస్తోంది.

ఉత్తరప్రదేష్’‌లోని మొరాదాబాద్‌కు చెందిన వార్డ్ బాయ్ మహిపాల్ సింగ్(46) శనివారం మధ్యాహ్నం కోవిడ్ వ్యాక్సిన్ షాట్ తీసుకున్నారు. 24 గంటల తరువాత ఛాతీలో ఇబ్బంది, ఊపిరి ఆడకపోవడం లాంటి సమస్యలతో ఆదివారం సాయంత్రం ఆయన మరణించారు. అయితే వ్యాక్సిన్‌ తీసుకోడానికిముందే మహిపాల్‌ అనారోగ్యంతో బాధపడుతున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో.. మహిపాల్ మరణానికి, టీకాకు సంబంధం లేదని భావిస్తున్నామని జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఎంసీ గార్గ్ తెలిపారు.