గుడ్ న్యూస్ : పీఆర్సీపై ప్రకటనకు సర్వం సిద్ధం

ఏ క్షణమైనా ఉద్యోగులకి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పొచ్చని సమాచారమ్. ఇప్పటికే జీతాల పెంపు ప్రక్రియ కొలిక్కి వచ్చినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు.. ఫిట్‌మెంట్‌ కూడా సంతృప్తికరంగా ఉంటుండని చెబుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఒప్పించి ఈ నెలాఖరు వరకు 11వ పీఆర్సీని ఇప్పిస్తామని టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ అన్నారు.

మరోవైపు ఫిబ్రవరి 18న మంత్రి కేటీఆర్ కు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించనున్నారు. ఆ వెంటనే నిరుద్యోగులు, ఉద్యోగులకి ఒకేసారి గుడ్ న్యూస్ చెప్పబోతున్నారని సమాచారమ్. ఉద్యోగ ప్రకటనలతో పాటు, ఉద్యోగులకు జీతాల పెంపునపై స్వయంగా కొత్త సీఎం కేటీఆర్ ప్రకటన చేస్తారని చెబుతున్నారు. తద్వారా ప్రభుత్వంపై యువతలో నెలకొన్న అసంతృప్తిని తొలగించవచ్చనే ప్లాన్ చేశారని సమాచారమ్.