31లోగా ఉద్యోగులకు ప్రమోషన్స్


ప్రభుత్వ ఉద్యోగులకి ప్రమోషన్స్ ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియ ఇప్పటికే ఓ కొలిక్కి వచ్చింది. ఏ క్షణమైన ఉద్యోగులకి గుడ్ న్యూస్ అందనుందనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోప్రమోషన్స్ పై మంత్రి శ్రీనివాస్ గౌడ్ మరింత క్లారిటీ ఇచ్చారు. ఈ నెల 31లోగా ఉద్యోగులకి ప్రమోషన్స్ ఇవ్వబోతున్నామని శుభవార్త చెప్పారు.

పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అసోసియేషన్ కాలెండర్-2021 ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ మంగళవారం ఆవిష్కరించారు. ఈ సంధర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియ మొదలై ఇప్పటికే చాలా శాఖల్లో డీపీసీలను ముగించుకొని పదోన్నతుల ఉత్తర్వులను ఇవ్వడం మొదలైందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాణిజ్య పన్నులశాఖ, అబ్కారీ శాఖ, గ్రౌండ్ వాటర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, మున్సిపల్‌శాఖ, అర్ధగణాంకశాఖ ఇలా అన్ని శాఖలలో పదోన్నతుల ప్రక్రియ మొదలైందన్నారు. ఈ నెల 31లోపు అన్నీ శాఖల్లో అర్హులైన ఉద్యోగులందరికీ పదోన్నతులు లభిస్తాయని తెలిపారు.