ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్’కు భారతజట్టు ప్రకటన

ఆస్ట్రేలియా టూర్ ని ఘనంగా ముగించింది టీమిండియా. స్వదేశంలో ఇంగ్లండ్‌తో నాలుగు టెస్ట్‌ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లోని తొలి రెండు టెస్ట్‌లకు తాజాగా జట్టుని ప్రకటించారు. ఆసీస్ టూర్ లోనే మూడు ఫార్మెట్లలోనూ అరంగేట్రం చేసిన నటరాజన్ కు చోటు దక్కలేదు. కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఇషాంత్ శర్మ, హార్థిక్ పాండ్యా తిరిగి జట్టులో చేరారు.

భారత జట్టు :

విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే, రిషభ్ పంత్, వృద్దిమాన్ సాహా, హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్, జస్‌ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్ , వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్

స్టాండ్‌బై ప్లేయర్స్ : కేఎస్ భరత్, అభిమన్యూ ఈశ్వరణ్, షబాజ్ నదీమ్, రాహుల్ చాహర్

నెట్ బౌలర్స్ : అంకిత్ రాజ్‌పుత్, అవేశ్ ఖాన్, సందీప్ వారియర్, గౌతమ్, సౌరభ్ కుమార్