పవన్-క్రిష్ సినిమా.. మళ్లీ బ్రేక్ పడింది ! 

‘వకీల్ సాబ్’ షూటింగ్ పూర్తయింది. ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా పవన్ కల్యాణ్ క్రిష్ సినిమా షూటింగ్ లో జాయిన్ అయిపోయాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ కొనసాగుతోంది. ఈ షెడ్యూల్‌ గురువారంతో పూర్తి కానుంది. ఈ షెడ్యూల్‌లో రెండు పాటలను పూర్తి కానున్నాయట. అయితే ఈ సినిమా షూటింగ్‌కు కొద్ది రోజులు బ్రేక్ పడనుంది. మళ్లీ ఫిబ్రవరిలో క్రిష్ సినిమాకు పవన్ డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

ఈ గ్యాప్ లో ‘అయ్యపనుమ్‌ కోషియమ్‌’ షూటింగ్‌లో పాల్గొననున్నారు. ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించనున్నారు. రానా దగ్గుబాటి మరో హీరోగా నటిస్తున్నారు. మలయాళంలో బిజూ మీనన్, పృథ్వీరాజ్‌లు హీరోలుగా నటించగా.. బిజూ మీనన్‌ పాత్రను పవన్ కల్యాణ్‌, రానా పృథ్వీరాజ్ పాత్రలో కనిపించనున్నాడు. క్రిష్ సినిమా, అయ్యపనుమ్‌ కోషియమ్ రిమేక్ తర్వాత హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి సినిమాల్లో పవన్ నటించనున్నారు.