ఆహా.. క్రాక్ ఓటీటీ రిలీజ్ కూడా !

రవితేజ-గోపీచంద్ మలినేని కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం ‘క్రాక్’. శృతిహాసన్ హీరోయిన్. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సంక్రాంతి విజేత అనిపించుకుంది. ఇప్పుడీ ఈ సినిమాని ఓటీటీలోనూ రిలీజ్ చేయనున్నారు. తెలుగు ఓటీటీ యాప్ ఆహాలో ఈ నెలాఖరులో క్రాక్ రిలీజ్ కానుందని సమాచారమ్. ఆహా సంస్థ ఈ చిత్రం డిజిటల్ హక్కులను 8.2 కోట్లకు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.

ఆహాలో ఇప్పటి వరకు స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ కాలేదు. రిమేక్ సినిమాలు, చిన్ని సినిమాలని రిలీజ్ చేస్తూ.. ఆహా.. ఫాలోయింగ్ పెంచుకుంటుంది. తొలిసారి క్రాక్ తో స్టార్ హీరో సినిమా రిలీజ్ చేయబోతుంది. థియేటర్స్ లో కేక పుట్టించిన క్రాక్.. ఓటీటీలోనూ అదరగొట్టడం ఖాయం. ఇక క్రాక్ సినిమా రిలీజ్ కష్టాలని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. నిర్మాత ఠాగూర్ మధు గత సినిమాల బాకీలు ఈ సినిమా రిలీజ్ కు అడ్డుపడ్దాయి.

దీనిపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు గోపీచంద్ మలినేని స్పందించారు. క్రాక్ సినిమాను ఓటీటీ రిలీజ్ చేయాలనీ చాలా ఒత్తిడి తెచ్చారు. తట్టుకోలేక క్రాక్ ఇన్ థియేటర్స్ అని ట్వీట్ చేశా.. అంత మొండిగా వ్యవహరించాల్సి వచ్చింది. ఇది మాస్ సినిమా.. థియేటర్స్ లో చూస్తే ఆ మజా వస్తుంది.

జనవరి 9న రిలీజ్ చేసాం కానీ నాకు పెద్ద షాక్ తగిలింది. ఉదయం 8.45కి షో పడలేదు.. 11గంటలకు పడలేదు.. మాట్నీ కూడా పడలేదు. ఫస్ట్‌షో కూడా పడలేదు. ఆ టైమ్‌లో చాలా ఇబ్బంది అనిపించింది. దాన్ని మాటల్లో చెప్పలేను. చివరకు సెకండ్ షో పడింది. అప్పటికి జనాలు వస్తారని అనుకోలేదు. కానీ  మొదటి షో తోనే సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చేసుకుంది. 50శాతం నిబంధనతో రవితేజగారి కెరీర్‌లోనే పెద్ద హిట్‌ అంటే మామూలు విషయం కాదన్నారు.