బాలీవుడ్’లోకి మహేష్ పాట.. నిజమా ?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి పరశురామ్ దర్శకుడు. ఈ సినిమా తర్వాత దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ సినిమా ఉండనుంది. ఇప్పటికే మహేష్ కోసం జక్కన్న కథని రెడీ చేశారు. ఛత్రపతి శివాజీగా మహేష్ ని చూపించబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇది పాన్ ఇండియా సినిమాగా రాబోతుంది. దీంతో.. ఈ సినిమాతో మహేష్ బాలీవుడ్ కి పరిచయం కానున్నారని అనుకున్నారు. కానీ, అంతకంటే ముందే మహేష్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చేలా ఉన్నాడు.

అవునూ.. సర్కారు వారి పాటని నేషనల్ వైడ్ రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా కోసం బాలీవుడ్ నటీనటులని తీసుకుంటున్నారట. బ్యాంకిగ్ రంగంలో జరిగే ఆర్థిక నేరాల నేపథ్యంలో సర్కారు వారి పాట తెరకెక్కతోందని తెలుస్తోంది. బలమైన ఎమోషన్స్ కూడిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఉంటుందని మహేష్ ఓ ఇంటర్వ్యూలో తెలిపిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మహేష్ కి  జంటగా కీర్తి సురేష్ నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్స్‌మెంట్స్, జీ ఎమ్ బీ ఎంటర్‌టైన్స్‌మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.