నటరాజన్’కు ఘన స్వాగతం

ఆస్ట్రేలియా పర్యటనలో అదరగొట్టిన టీమ్‌ఇండియా క్రికెటర్లు స్వదేశానికి చేరుకున్నారు. వీరికి అభిమానులు క్రికెటర్లకు ఘన స్వాగతం పలికారు. పువ్వులు చల్లుతూ.. డప్పులు వాయిస్తూ.. వీర తిలకం దిద్దారు. ఇక సారథ్యం వహించిన అజింక్య రహానెకైతే ఊహించని రీతిలో స్వాగతం లభించడం గమనార్హం. ఇక ఆసీస్ టూర్ లోనే మూడు ఫార్మెట్స్ లో అరంగేట్రం చేసిన నటరాజన్ కు చెన్నైలో ఘన స్వాగతం పలికింది. ఆయన్ని రథంపై ఊరేగిస్తూ తీసుకెళ్లారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో టీమ్‌ఇండియా అద్భుత విజయం సాధించింది. 2-1తో సిరీస్‌ కైవస చేసుకొంది. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 36కే ఆలౌటైన భారత జట్టు ఆ తర్వాత పుంజుకొని.. ఆతిథ్య జట్టును 1-2తో ఓడించింది. సిడ్నీలో కీలక ఆటగాళ్లు ఔటైనా.. పంత్‌ చెలరేగాడు. అశ్విన్‌, విహారి భరించలేని నొప్పిని అనుభవిస్తూనే ఆఖరి రోజంతా ఆడి డ్రా చేశారు. ఇక ఆఖరి టెస్టులో పుజారా అండతో శుభ్‌మన్‌ గిల్‌, పంత్‌ రెచ్చిపోయారు. తిరుగులేని విజయం అందించి సరికొత్త చరిత్ర సృష్టించారు.