నైజాం పోరు.. రోడెక్కనున్న వరంగల్ శ్రీను

టాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్లలో కింగ్ పిన్ శిరీష్ రెడ్డి కి, వరంగల్ శ్రీనుకు మధ్య క్లాష్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వివాదం ఇంకా ముగిసిపోలేదు. తనకు సారీ చెప్పాలని శిరీష్ రెడ్డి కోరుతున్నట్లు తెలుస్తోంది. తనకు అన్యాయం జరిగితే తాను గొంతెత్తానని, దానికి తానెందుకు సారీ చెబుతానని వరంగల్ శ్రీను భీష్మించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ శుక్రవారం నుంచి కూడా క్రాక్ కు థియేటర్లు అందకుండా చేసే ప్రయత్నం ఏదో తెరవెనుక జరుగుతోందని సమాచారమ్.

అదే జరిగితే.. నైజాం పోరుని మరింత హీటెక్కించాలనే ప్లాన్ లో వరంగల్ శ్రీను ఉన్నారట. తనకు ఇప్పుడు కూడా థియేటర్లు ఇవ్వకపోతే, మొత్తం నైజాం మొత్తం మీద అన్ని మల్టీ ఫ్లెక్స్ లు, థియేటర్లలో సినిమా ప్రదర్శన ఆపేసి, రోడ్డు మీదకు వచ్చి, మీడియాను, పెద్దలను న్యాయం కోరడానికి రెడీ అవుతున్నారట. మొత్తానికి.. నైజాం పంచాయతీ మరింత ముదిరేలా కనిపిస్తోంది.