గిల్ తండ్రిపై సెహ్వాగ్ సటైర్

గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో భారత్ చారిత్రక విజయం సాధించిన సంగతి తెలిసిందే. విజయంలో యువ క్రికెటర్లు రిషభ్‌ పంత్‌, శుభ్‌మన్ గిల్‌, వాషింగ్టన్‌ సుందర్, శార్దూల్ ఠాకూర్‌, మహ్మద్‌ సిరాజ్‌ కీలక పాత్ర పోషించారు. అయితే శుభ్‌మన్‌ గిల్ తండ్రి లఖ్విందర్‌ గిల్‌, వాషింగ్టన్‌ సుందర్‌ తండ్రి ఎం.సుందర్‌.. వాళ్ల కుమారుల ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. శతకం సాధించలేకపోయారని నిరాశ పడ్డారు.

వీరిద్దరిని ఉద్దేశిస్తూ టీమిండియా మాజీ ఆటగాడు సెహ్వాగ్ సరదాగా ఓ పోస్ట్ చేశాడు. ”తల్లిదండ్రులు..ఎప్పటికీ తల్లిదండ్రులే” అని వ్యంగ్యంగా దానికి వ్యాఖ్య జత చేశాడు. దీనికి టీమిండియా క్రికెటర్లు శిఖర్‌ ధావన్‌, యుజువేంద్ర చాహల్ లైక్ కొట్టగా, యువరాజ్‌ సింగ్ నవ్వుతున్న ఎమోజీలను కామెంట్ పెట్టారు. సెహ్వాట్ ట్విట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.