మరో రిమేక్’ని ప్రకటించిన మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమాతో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య తెరకెక్కుతోంది. కాజల్ కథానాయిక. రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా తర్వాత ‘లూసిఫర్’ తెలుగు రిమేక్ లో చిరు నటించనున్నారు. ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకుడు. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఫిబ్రవరి నుంచి రెగ్యూలర్ షూటింగ్ మొదలు కానుంది.తాజాగా మెగాస్టార్ మరో రిమేక్ ని ప్రకటించారు.

బాబీ దర్శకత్వంలో వేదాళం రిమేక్ ఉండబోతుందని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాని అధికారికంగా ప్రకటించారు చిరు. తాజాగా చిరు ఓ ఫొటోని షేర్‌ చేసి.. ఈ నలుగురు నా కెప్టెన్లు అంటూ ప్రకటించారు. ఈ పిక్‌లో చిరు మధ్యలో ఉండగా.. అటువైపు, ఇటువైపు మెహర్‌ రమేష్‌, మోహన్‌ రాజా, కొరటాల శివ, బాబీ ఉన్నారు. ఈ నలుగురితో చిరు సినిమాలు చేయబోతున్నారు కాబట్టే.. కెప్టెన్లు అంటూ ప్రకటించారు. సో.. బాబీతో సినిమా విషయంలో ఇక ఎటువంటి డౌట్స్‌ అవసరం లేదు. ఆయనతో సినిమా ఫిక్సయిందన్నమాట.