సర్కారు వారి పాట.. షూటింగ్ ఫస్ట్ డే’నే రికార్డ్ !

సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి తెలిసిందే. ఆయన తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. పరశురామ్ దర్శకుడు. దుబాయ్ లో ఈరోజే షూటింగ్ మొదలైంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రబృందం ట్విట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో #SarkaruVaariPaata ట్యాగ్ లైన్ వైరల్ అయింది. ఏకంగా వంద మిలియన్ల ట్వీట్‌లు వచ్చాయి.ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నడూ లేని విధంగా ఈ సినిమా రికార్డు చేసింది. దీంతో మహేష్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. షూటింగ్ తొలిరోజు మహేశ్ హవా ఇలా ఉంటే.. సినిమా రిలీజ్ అయ్యేవరకు, అయిన తర్వాత ఎన్ని రికార్డులు కొల్లగొడతారో.. చూడాలి.

బ్యాంక్ దోపిడి నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇందులో మహేష్ కి జంటగా కీర్తి సురేష్ నటిస్తున్నారు.మైత్రీమూవీ మేకర్స్‌, 14 రీల్స్‌ ప్లస్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో మహేష్ సరికొత్త లుక్ లో కనిపించనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా కసరత్తులు చేశాడు. స్లిమ్ గా తయారయ్యారు. మునుపెన్నడూ.. లేని విధంగా యంగ్ లుక్ లోకి మారిపోయారు.