సీబీఎస్‌ఈ పరీక్షల షెడ్యూల్ రెడీ

సీబీఎస్‌ఈ 10, 12వ తరగతుల విద్యార్థులకు బోర్డు పరీక్షల షెడ్యూల్‌ రెడీ అయింది. ఈ షెడ్యూల్‌ను ఫిబ్రవరి 2న వెల్లడించనున్నట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ ప్రకటించారు. అలాగే, విద్యార్థులకు చెందిన 40 ఏళ్ల రికార్డులను సీబీఎస్‌ఈ డిజిటిలైజ్‌ చేయనుందని తెలిపారు.

సాధారణంగా అయితే సీబీఎస్ఈ 10, 12 తరగతులకి పరీక్షలు ఏటా ప్రాక్టికల్‌ పరీక్షలు జనవరిలో.. రాత పరీక్షలు ఫిబ్రవరిలో మొదలై మార్చిలో ముగిసేవి. కానీ కరోనా విజృంభణ నేపథ్యంలో ఈ ఏడాది పరీక్షల నిర్వహణలో జాప్యం నెలకొంది. మరోవైపు, సీబీఎస్‌ఈ 10,12వ తరగతుల బోర్డు పరీక్షలను ఈ ఏడాది మే 4 నుంచి జూన్‌ 10 వరకు నిర్వహించనున్నట్టు డిసెంబర్‌ 31న మంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పరీక్ష ఫలితాలు జులై 15న వెల్లడిస్తామని కూడా ఆయన చెప్పారు. ఫిబ్రవరి 2న ప్రకటించే షెడ్యూల్ ఇలాగే ఉంటుందా  ? లేక ఏమైనా మార్పులు చేస్తారా ?? అన్నది చూడాలి.