ధోని ప్రత్యేకత అదే.. !

కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోని టీమిండియాకు అద్భుత విజయాలు అందించారు. టీ20, వన్డే వరల్డ్ కప్ లని తెచ్చిపెట్టారు. టెస్టుల్లోనూ టీమిండియాని నెం.1 స్థానంలో నిలిపారు. అలాంటి ధోనిపై కూడా అప్పుడప్పుడు విమర్శలు చేసేవాడు టీమిండియా మాజీ ఓపెనర్ గంభీర్. అయితే ఈ సారి గంభీర్ ధోనిపై ప్రశంసలు కురిపించారు. ధోని ప్రత్యేకత గురించి తెలిపారు. ఐపీఎల్-2021కు సంబంధించి పలు జట్లు తమ ఆటగాళ్లను తొలగించుకున్నాయి.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అత్యధికంగా 10 మంది ఆటగాళ్లను విడుదల చేసింది. చెన్నై జట్టు మాత్రం పెద్దగా మార్పులు చేయలేదు. కేవలం ఐదు మంది ఆటగాళ్లను మాత్రమే వదులుకుంది. ఈ అంశంపై గంభీర్ మాట్లాడుతూ..  ధోనీ ప్రత్యేకత ఇదే. సీఎస్కే  సక్సెస్ కు ధోనీయే కారణమన్నారు. ఆటగాళ్లపై  సీఎస్కే విశ్వాసాన్ని కనబరిచిందని… దీనికి ధోనీయే కారణమని చెప్పుకొచ్చాడు.