వారణాసిలో కేసీఆర్ ఫ్యామిలీ (వీడియో)

సీఎం కేసీఆర్ కుటుంబంలో కలిసి కాశీ పర్యటనకి వెళ్లిన సంగతి తెలిసిందే. రెండ్రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు కేసీఆర్ కుటుంబం వారణాసిలో పర్యటించింది. ఈ సందర్భంగా అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ అస్సీఘాట్‌ నుంచి దశాశ్వేమేధ ఘాట్‌ వరకు పడవ ప్రయాణం చేశారు.

అనంతరం తల్లీకూతుళ్లు దశాశ్వేమేధ ఘాట్‌లో గంగా నదికి హారతిచ్చారు. తరువాత ప్రాచీన సంకట్‌ మోచన్‌ హనుమాన్‌ మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను కవిత సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.