20 నిమిషాలకి పూజా రేటు.. రూ. కోటి !

బుట్టబొమ్మ పూజా హెగ్డేతో 20 నిమిషాల పని ఉంది. అందుకు ఆమె ఎంత డిమాండ్ చేసిందో తెలుసా ? అక్షరాల రూ. కోటి. అది కూడా మెగాస్టార్ చిరంజీవి సినిమా ఆచార్య. ఇందులో చిరుకి జంటగా కాజల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కీలక పాత్రలో రామ్ చరణ్ కనిపించనున్నారు. ఆయనకి జంటగా పూజా హెగ్డే ని తీసుకున్నారు. 20 నిమిషాల పాత్ర అది. దానికి గానూ.. ఆమె రూ. కోటి డిమాండ్ చేసిందని.. అంత ఇవ్వడానికి చిత్రబృందం ఓకే చేసిందని సమాచారమ్.

ప్రస్తుతం పూజా ఫుల్ బిజీ. ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ ని ఏలుతోంది. ఇప్పుడు కోలీవుడ్ లోకి అడుగుపెట్టబోతుంది. కోలీవుడ్ స్టార్ విజయ్ తదుపరి సినిమాలో ఆమెనే హీరోయిన్ అనే ప్రచారం జరుగుతోంది. ఇదీగాక.. బుట్టబొమ్మ కాళ్లని చూసే సొల్లు కార్చుకొనేలా త్రివిక్రమ్ తయారు చేశాడు. దీంతో.. పూజా ఏమాత్రం తగ్గడం లేదు. రూ. కోటికి తక్కువైతే.. నటించేది లేదని తేల్చి చెబుతోంది. అది మెగాస్టార్ సినిమా అయిన సరే. అందుకే ఆచార్యలో ఆమె 20 నిమిషాల పాత్ర కోసం రూ. కోటి సమర్పించుకుంటున్నారు.