‘పుష్ప’ రిలీజ్ డేటు వచ్చేసింది

అల్లు అర్జున్‌ – సుకుమార్‌ కాంబోలో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్ చిత్రం ‘పుష్ప’. ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను చిత్రబృందం తాజాగా ప్రకటించింది. రిలీజ్‌డేట్‌ను తెలియజేస్తూ బన్నీ ట్విటర్‌ వేదికగా.. ‘పుష్ప’ స్పెషల్‌ పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు.

‘2021 ఆగస్టు 13వ తేదీన ‘పుష్ప’ థియేటర్లలో విడుదల కానుంది. ఈ ఏడాది థియేటర్లలో మీ అందరినీ కలవడం కోసం నేను ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నాను. నేను, సుకుమార్‌, దేవిశ్రీప్రసాద్‌లు మరోసారి చరిత్ర పునరావృతం చేస్తామని ఆశిస్తున్నాను’ అని బన్నీ ట్వీట్‌ చేశారు.

ఎర్రచందనం స్మగ్లింగ్‌ కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఈ చిత్రంలో బన్నీకి జంటగా రష్మిక మందన నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీమూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.