సైకిల్ పై సాయి పల్లవి.. ఫిదా కావాల్సిందే !


వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా న‌టిస్తున్న చిత్రం `విరాట‌ప‌ర్వం`. న‌క్స‌లిజం నేప‌థ్యంలో సాగే అంద‌మైన ప్రేమ‌క‌థా చిత్ర‌మది.1990లలో జరిగిన వాస్తవ ఘటన ఆధారంగా రూపొందుతోంది. ఈ చిత్రంలో డా. రవి శంకర్‌ అలియాస్‌ న‌క్స‌లైట్ నాయ‌కుడు కామ్రేడ్‌ రవన్నగా రానా  తన విశ్వరూపాన్ని ప్రదర్శించనున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేటుని ఫిక్స్ చేసుకుంది. ఏప్రిల్‌ 30 న విరాటపర్వం’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రం తెలుగుతో పాటు  హిందీ, తమిళ భాష‌ల్లోనూ రిలీజ్ కానుంది.

రిలీజ్ డేటు పోస్టర్ తో పాటు సాయి పల్లవి సైకిల్ తొక్కుతున్న ఓ ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పల్లెటూరులో గల్లెలో సాయి పల్లవి పెద్ద సైకిల్ తొక్కుతో కనిపించింది.ఇక ఈ చిత్రంలో ప్రియమణి, నందితా దాస్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సురేష్‌బాబు స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ‌ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ బ్యాన‌ర్‌పై సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందిస్తున్నారు.