సలార్’లో ప్రభాస్ జోడిగా శృతిహాసన్


హీరోయిన్ శృతిహాసన్ బంపర్ ఆఫర్ కొట్టేసింది. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ‘సలార్’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీని హీరోయిన్ గా అనుకున్నారు. కానీ ఆమెకు డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో.. శృతిహాసన్ ని తీసుకున్నారు.
ఈరోజు శృతిహాసన్ బర్త్ డే కానుకగా ఆమె పేరుని సలార్ చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఆ మధ్య ప్రేమ వ్యవహారాల్లో పడి శృతిహాసన్ కెరీర్ ని నెగ్లెక్ట్ చేసింది. అయితే రీ ఎంట్రీతోనే క్రాక్ తో బ్లాక్ బస్టర్  హిట్ అందుకుంది. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.

త్వరలోనే సలార్ షూటింగ్ సింగరేణిలో జరగనుంది. బొగ్గుగని ప్రాంతంలో వీర పోరాటం చేయనున్నారు. ఈ మేరకు ఓపెన్‌కాస్ట్‌ ప్రాంతంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ సినిమాలో ఓ ఫైటింగ్‌ సన్నివేశాన్ని రామగుండం-3 పరిధిలోని సింగరేణి ఓసీపీ-2లో చిత్రీకరించనున్నారు. ఈ క్రమంలో పది రోజుల పాటు షూటింగ్‌ జరగనుందని తెలుస్తోంది. ఈ మేరకు రామగుండం పరిధిలోని సింగరేణి ఓపెన్‌ కాస్ట్‌ ప్రాజెక్టులను ఎంచుకున్నారు.