బాలీవుడ్ హీరో పెళ్లిపై టాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ 


బాలీవుడ్‌ స్టార్‌ హీరో వరుణ్‌ధావన్‌ ఇటీవల తన ప్రేయసి నటాషా దలాల్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇరు కుటుంబపెద్దలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జనవరి 24న వీరి పెళ్లి ఘనంగా జరిగింది. దీంతో వరుణ్‌-నటాషా దంపతులకు సెలబ్రెటీలు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. ‘జెర్సీ’ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ కూడా వరుణ్ ధావన్ దంపతులని విష్ చేసింది. అదే సమయంలో షాకింగ్ కామెంట్స్ చేసింది.

మరో మంచి నటుడు పెళ్లి అనే ఊబిలోకి దిగాడు. ఇకపై అతన్ని మనం ఎక్కువ శాతం ఆన్‌స్ర్కీన్‌పై చూడలేకపోవచ్చు. సినిమాలో భాగంగా ఈ హీరో వేరే హీరోయిన్స్‌తో రొమాన్స్‌ చేస్తే.. అతని భార్య, అత్త వారింటి వాళ్లు ఒప్పుకోకపోవచ్చు. పురుష ప్రాధాన్యమున్న చిత్రాల్లోనే ఇకపై అతను నటిస్తాడా?. వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితాన్ని ఎలా బ్యాలెన్స్‌ చూస్తాడో. కొంచెం కష్టమే. కాబట్టి ఆయన్ని మనం మిస్‌ కానున్నాం. కంగ్రాట్స్‌ వరుణ్‌’ అని శ్రద్ధాశ్రీనాథ్‌ వ్యంగ్యంగా పోస్ట్‌ పెట్టారు.