బీజేపీలో చేరడంపై తెరాస ఎమ్మెల్సీ క్లారిటీ

తెరాస ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి బీజేపీలో చేరబోతున్న ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల తెలంగాణ భాజాపా నేతలు చిన్నపరెడ్డిని కలిశారు. పార్టీలోకి ఆహ్వానించారు. అందుకు ఆయన కూడా అంగీకరీంచారు. త్వరలోనే చిన్నపరెడ్డి కారు దిగి.. కమలతీర్థం పుచ్చుకోనున్నారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ ప్రచారంపై చిన్నపరెడ్డి స్పందించారు. ఆ ప్రచారంలో ఏమాత్రం నిజలేదని తెలిపారు.

తాను సీఎం కేసీఆర్‌కు, టీఆర్ఎస్‌ పార్టీకి విధేయుడునని చెప్పుకొచ్చారు. తనకి ఇంకో ఏడాది ఎమ్మెల్సీగా కొనసాగే అవకాశం ఉందని చెప్పారు. తనను బీజేపీ నేతలు సంప్రదించారనేది నిజం కాదని తోసిపుచ్చారు. తాను కూడా ఎవరితోనూ చర్చలు జరపలేదని, ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో ఉన్న తన నివాసంలో ఉన్నట్లు తెలిపారు. ఇంకో యేడాది ఎమ్మెల్సీ పదవిలో కొనసాగే అవకాశం ఉందన చిన్నపరెడ్డి.. ఆ తర్వాత బీజేపీలో చేరుతారేమో.. మరీ.. !