‘ఆచార్య’ టీజర్.. అదిరిపోయింది !

‘ధర్మస్థలి’కి ద్వారాలు తెరుచుకున్నాయి. ‘ఆచార్య’ టీజర్ వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. కాజల్‌ కథానాయిక. రామ్‌చరణ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయనకి జంటగా పూజా హెగ్డే కనిపించనుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌, కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై నిరంజన్‌రెడ్డి, రామ్‌చరణ్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

తాజాగా ఆచార్య టీజర్ ని రిలీజ్ చేశారు. రామ్‌చరణ్‌ వాయిస్‌తో టీజర్ ప్రారంభమైంది.  దేవాలయాలు, వాటిపై జరిగే అన్యాయాలపై పోరాడే వ్యక్తిగా చిరు కనిపించారు. యాక్షన్ హైలైట్ సాగిన టీజర్ లో.. చివరలో ‘పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా అందరూ ఎందుకో ఆచార్య అంటుంటారు. బహుశా గుణపాఠాలు చెబుతాననేమో’ అంటూ చిరు తనదైన పంచ్‌ డైలాగ్‌తో అదరగొట్టేశాడు.