30 శాతం తగ్గిన కరోనా కేసులు

కరోనా కేసులు గురువారం ఒక్కసారిగా పెరిగడం ఆందోళన కలిగించిన సంగతి తెలిసిందే. అయితే శుక్రవారం ఆ కేసుల్లో భారీ తగ్గుదల కనిపించింది. గడిచిన 24 గంటల్లో 13,083 కొత్త కేసులు నమోదయ్యాయ్. క్రితం రోజుతో పోల్చుకుంటే 30 శాతం తగ్గుదల కనిపించింది.

నిన్నటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,07,33,131గా ఉంది. నిన్న కొత్తగా 137 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1.54 లక్షలకు చేరింది.నిన్న ఒక్కరోజే 14,808 మంది వైరస్‌ నుంచి కోలుకోగా.. మొత్తంగా 1.04కోట్ల మంది ఈ మహమ్మారి నుంచి బయటపడ్డారు. ఇక, రికవరీ రేటు 97 శాతానికి చేరువకాగా..క్రియాశీల రేటు 1.60శాతానికి తగ్గింది. మరణాల రేటు 1.44 శాతంగా కొనసాగుతోంది.

మరోవైపు, జనవరి 16న ప్రారంభించిన టీకా కార్యక్రమంలో భాగంగా..ఇప్పటివరకు 35,00,027 మంది టీకా వేయించుకున్నారని కేంద్రం వెల్లడించింది.