‘ఖిలాడి’లో యాక్షన్ కింగ్


మాస్‌మహారాజ్‌ రవితేజ హీరోగా ‘ఖిలాడి’చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో ఒక ప్రధాన పాత్రలో యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ నటించనున్నారు. తాజాగా ఈ విషయాన్ని చిత్రబృందం ప్రకటించింది. అర్జున్ కూడా దీన్ని ధృవికరించారు.

2021 నూతన సంవత్సరంలో ఇదొక కొత్త ప్రారంభం.. ఖిలాడి సెట్లో నేను..’ అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ను పెడుతూ.. అక్కడ దిగిన తన తాజా ఫొటోను కూడ అర్జున్ పోస్ట్ చేశారు. ఇక ఈ ఖిలాడి సినిమాలో రవితేజ రెండు విభిన్న తరహా పాత్రలను పోషిస్తున్నారు. మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. పెన్‌ స్టూడియోస్‌ పతాకంపై కోనేరు సత్యనారయణ నిర్మిస్తున్నారు.