ఇందిరా గాంధీగా కంగన

బాలీవుడ్ లో వరుసగా బయోపిక్ లు క్యూ కడుతున్నాయ్. బ్లాక్ బస్టర్ హిట్ అవుతున్నాయ్. ఈ క్రమంలో భారత రాజకీయాలను అత్యంత ప్రభావితం చేసిన ఉక్కు మహిళ ఇందిరా గాంధీ. ఆమె కథతో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో కంగనా రనౌత్‌ టైటిల్‌ రోల్‌ పోషించనుంది. ప్రస్తుతం ఆమె తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలిత బయోపిక్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇందిరా గాంధీగా కంగనా ప్రేక్సక్షల ముందుకు రానుంది.

దీనిపై కంగనా మాట్లాడుతూ.. “అవును ఈ ప్రాజెక్టుపై పనిచేస్తున్నాం. స్క్రిప్ట్‌ తుది దశలో ఉంది. అయితే, ఇది ఇందిరాగాంధీ బయోపిక్‌ కాదు. ఇదొక పిరియాడిక్‌ ఫిల్మ్‌. కేవలం పొలిటికల్‌ డ్రామా. ఈ చిత్రం ద్వారా భారతీయ రాజకీయ స్వరూపాన్ని నేటి తరానికి చూపించబోతున్నాం. ఈ చిత్రంలో పలువురు ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించనున్నారు” అని తెలిపింది.