స్టార్ హోటల్ నుంచి సినీ నిర్మాత కారు మాయం

ఓ సినీ నిర్మాతకు చెందిన ఖరీదైన కారు మాయమైంది. అది కూడా బంజారాహిల్స్‌లోని పార్క్‌హయత్‌ హోటల్ నుంచి. వివరాల్లోకి వెళీతే.. బెంగళూరులో నివసించే సినీ నిర్మాత, వ్యాపారి వి.మంజునాథ్‌ పార్క్ హయత్ ‌కు కారులో వచ్చారు. ఈ నెల 26న రాత్రి డ్రైవరు కారును హోటల్‌ బేస్‌-2లో నిలిపి మరుసటి రోజు ఉదయం వచ్చారు. పార్కింగ్‌లో కారు కనిపించ లేదు. దీంతో మంజునాథ్‌ గురువారం బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇది పార్క్‌హయత్ హోటల్ ఇమేజ్ ని డ్యామేజ్ చేసే ఘటన ఇది. గతంలో నిమ్మగడ్డ, సుజనా మీటింగ్ కు సంబంధించిన సీసీ పుటేజ్ బయటికొచ్చింది. ఇంత పెద్ద స్టార్ హోటల్ లో భద్రతనే కరువా ? అనే చర్చ జరిగింది. ఆ తర్వాత కూడా చాలా సార్లు పార్క్ హయత్ అంత సేఫ్ కాదనే ఘనటనలు వెలుగులోకి వచ్చాయ్. తాజాగా ఓ సినీ నిర్మాత కాస్ట్లీ కారు పార్క్ హయత్ నుంచి గయాబ్ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది.