మదనపల్లె ఘటన : కూతురు నాలుక కోసి తిందట

మదనపల్లెలో ఈ నెల 24న కన్నబిడ్డలను హతమార్చిన ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ‘తనని తాను కాఌకగా భావించుకున్న నా భార్య పద్మజ.. పెద్ద కుమార్తె ఆలేఖ్య (27)ను చంపిన తర్వాత ఆమె నాలుకని కోసి తినేసింది’ అని భర్త పురుషోత్తంనాయుడు తెలిపినట్టు సమాచారమ్. తాను పుర్వజన్మలో అర్జుడినని ఆలేఖ చెప్పేదని పురుషోత్తం చెప్పినట్టు తెలిసింది. కలియుగం అంతమై.. సత్యయుగం వస్తుందని అలేఖ్య అనేది. కరోనా కూడా ఇందుకు ఒక సూచిక అని చెప్పేది. ఈ మాటలన్నీ నిజమే. నేను చదివిన ఆధ్యాత్మిక పుస్తకాల్లోనూ ఈ విషయాలే ఉన్నాయని అతడు వైద్యులకు చెప్పారు.

పద్మజ సన్నిహితులను మానసిక వైద్యులు విచారించగా ఆమె తండ్రి కూడా 20 ఏళ్లుగా మానసిక సమస్యలు ఎదుర్కొన్నారని తెలిసింది. పద్మజ మేనమామ కూడా ఇలాంటి ఇబ్బందులే పడ్డారని, వంశపారంపర్యంగా పద్మజకు.. ఆమె కూతురు అలేఖ్యకు ఇది సంక్రమించి ఉండొచ్చని మానసిక వైద్యులు భావిస్తున్నారు. చెల్లి చచ్చిపోతానంటే అక్క ఆమెను ప్రోత్సహించింది. అలాంటి ఆలోచన సరికాదని మొదట్లో వారికి సర్దిచెప్పిన తల్లిదండ్రులూ చివరికి అదే మూఢవిశ్వాస మైకంలోకి వెళ్లిపోయారు. చివరకు ఘోరమైన హత్యలకు పాల్పడ్డారు.