ఆచార్య సెట్’లో తెలంగాణ మంత్రి


కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘ఆచార్య’. తాజాగా ఈ సినిమా సెట్ లో తెలంగాణ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రత్యక్షమయ్యారు. చిరుతో కలిసి ఫోటోలకి పోజులిచ్చారు. వాటిని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన మంత్రి.. ‘ఆచార్య చిత్ర యూనిట్ తో చిరు హాసం.. చిరు చిత్రం విజయవంతం కావాలని కోరుతూ.. ‘ అంటూ కామెంట్ పెట్టారు.

ఆచార్యలో చిరుకి జంటగా కాజల్ నటిస్తున్నారు. రామ్‌చరణ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయనకి జంటగా పూజా హెగ్డే కనిపించనుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌, కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై నిరంజన్‌రెడ్డి, రామ్‌చరణ్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శుక్రవారమే రిలీజైన ఆచార్య టీజర్ కి మంచి స్పందన వస్తోంది. టీజర్ లో దేవాలయాలు, వాటిపై జరిగే అన్యాయాలపై పోరాడే వ్యక్తిగా చిరు కనిపించారు. యాక్షన్ హైలైట్ సాగిన టీజర్ లో.. చివరలో ‘పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా అందరూ ఎందుకో ఆచార్య అంటుంటారు. బహుశా గుణపాఠాలు చెబుతాననేమో’ అంటూ చిరు తనదైన పంచ్‌ డైలాగ్‌తో అదరగొట్టేశాడు.