కేంద్ర బడ్జెట్ 2021-22 లైవ్ అప్ డేట్స్

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2021-22ను లోక్ సభలో ప్రవేశపెడుతున్నారు. దేశ చరిత్రలోనే తొలిసారి పేపర్ లెస్ బడ్జెట్ ని తీసుకొచ్చారు. మేకిన్ ఇండియా ట్యాబ్ లో నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగాన్ని చదువుతున్నారు. ఎప్పుడూ ఎదుర్కోని విపత్కర పరిస్థితుల్లో బడ్జెట్ ని తయారు చేయడం జరిగిందని నిర్మలమ్మ అన్నారు. లాక్ డౌన్ పెట్టకపోయి ఉంటే భారతదేశం భారీ నష్టాన్ని చవి చూడాల్సి వచ్చేది. అత్యవసర సేవల రంగంలో పని చేసినవారు అందరు తమ ప్రాణాలని పణంగా పెట్టి పనిచేశారు. విద్యుత్, వైద్యారోగ్యం, బ్యాకింగ్, అగ్నిమాపక సిబ్బంది గొప్పగా పని చేశారని కితాబిచ్చారు.

* రక్షిత మంచినీటి పథకాల కోసం రూ.87వేల కోట్లు

* 2కోట్ల 18 లక్షల ఇళ్లకు రక్షిత మంచినీరు

* జల జీవన్‌ మిషన్‌కు రూ.2,87,000 కోట్లు కేటాయింపు

* కోవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ కోసం 35వేల కోట్లు

* మెగా ఇన్వెస్ట్‌మెంట్‌ టెక్స్‌టైల్‌ పార్క్‌

* కొత్తగా బీఎస్‌ఎల్‌-3 ప్రయోగశాలలు 9 ఏర్పాటు

* వాహన పొల్యూషన్‌ను తగ్గించడంపై ప్రత్యేక దృష్టి

* పర్యావరణ హితంగా వాహనాలు ఉండాలన్నది లక్ష్యం

* వ్యక్తిగత వాహనాలు 25 ఏళ్లు, కమర్షియల్‌ వాహనాలు 15 ఏళ్లుగా నిర్ధారణ

* 64,150 కోట్లతో ఆత్మనిర్భర భారత్‌ : రైతుల ఆదాయం రెట్టింపులక్ష్యం

* 6 సంవత్సరాలకు గాను 64వేల 180కోట్లరూపాయలతో ఆత్మనిర్భర్‌ యోజన పేరుతో కొత్త పథకం

* నేషనల్‌ డిసిజ్‌ కంట్రోల్‌ సిస్టం మరింత పటిష్టం ,దేశ వ్యాప్తంగా 15 ఎమర్జెన్సీ సెంటర్లు

* ఆరోగ్య రంగానికి పెద్దపీట

* 100 దేశాలకు మనం కరోనా టీకాలను సరఫరా చేస్తున్నాం

* కరోనా కేసులను కట్టడి చేయడంతో దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టగలిగాం

* ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే అన్ని అంశాలను బడ్జెట్‌లో పొందుపరిచాం

* ప్రధాని మోదీ హయాంలో 9వ బడ్జెట్‌, బడ్జెట్‌ యాప్‌ రిలీజ్‌ చేసిన కేంద్రం

* అనేక సంక్షోభాలను ఎదుర్కొని ఆర్థిక వ్యవస్థను బాగుచేశాం

* లాక్‌డౌన్‌ సందర్భంగా లక్షలాది మందికి ఉచితంగా ధాన్యం ఇచ్చాం