బ్రేకింగ్ : ఆదిపురుష్ సెట్ లో భారీ అగ్నిప్రమాదం


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తొలి స్ట్రయిట్ బాలీవుడ్ చిత్రం ‘ఆదిపురుష్’. ఈ చిత్రానికి ఓమ్ రౌత్ దర్శకుడు. టీ-సీరీస్ ఫిలిమ్స్, రెట్రో ఫిలిస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈరోజే ముంబైలో షూటింగ్ ప్రారంభమైంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రభాస్ ట్విట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రభాస్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అయితే వారి ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. ఆదిపురుష్ సెట్ లో మొదటిరోజే భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

ముంబైలోని ఆదిపురుష్ సెట్లో కాసేప‌టి క్రిత‌మే మంట‌లు చెల‌రేగాయి. సెట్ లో ఉన్న బ్లూ మాట్ లు కాలి బూడిద‌య్యాయి. అదృష్ట‌వ‌శాత్తూ.. ఎవ్వ‌రికీ ఎలాంటి గాయాలూ కాలేదు. ఇది ఇండోర్ సెట్‌. ఖ‌రీదైన వ‌స్తువులేం లేవు. అందుకే.. ఆస్తి న‌ష్టం కూడా సంభ‌వించ‌లేదు. కాక‌పోతే… తొలి రోజే.. ఇలాంటి అపశృతి చోటు చేసుకోవ‌డం… చిత్ర‌బృందాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. దాదాపు 300కోట్ల బడ్జెట్ తో ఆదిపురుష్ ని తెరకెక్కించనున్నట్టు సమాచారమ్. బాలీవుడ్ ప్రముఖ హీరో సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో రావణుడి పాత్ర పోషిస్తున్నాడు. ఇక సీత పాత్ర‌లో కృతిస‌న‌న్ న‌టిస్తోందని , త‌ల్లి పాత్ర‌లో హేమ‌మాలిని న‌టిస్తోంద‌ని,  ల‌క్ష్మ‌ణుడిగా టైగ‌ర్ ష్రాఫ్‌ని ఎంపిక చేసార‌ని సమాచారమ్.