‘ఈ-వాచ్’ యాప్’ని ఆవిష్కరించిన నిమ్మగడ్డ

ఏపీ పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించే క్రమంలో ఎన్నికల సంఘం ‘ఈ-వాచ్‌’ యాప్‌ను తీసుకొచ్చింది. తాజాగా విజయవాడలోని ఎన్నికల సంఘం కార్యాలయంలో బుధవారం ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఈ యాప్ ని‌ ఆవిష్కరించారు.

పంచాయతీ ఎన్నికల ఫిర్యాదుల స్వీకరణకు ఈ యాప్‌ ఉపయోగపడుతుందని అధికారులు వివరించారు. దీని ద్వారా ఎన్నికల్లో జరిగే అక్రమాలు, ప్రలోభాలపై ఎస్‌ఈసీకి నేరుగా ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. రేపటి నుంచి ఈ యాప్‌ గూగుల్‌ ప్లేస్టోర్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు.