కన్నీరు పెట్టుకున్న మేఘా ఆకాశ్

నితిన్ హీరోగా తెరకెక్కిన ‘లై’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయింది మేఘా ఆకాష్. ఆమె రెండో సినిమా కూడా నితిన్ తోనే. ‘ఛల్ మోహన్‌ రంగ’ సినిమాలోనూ నితిన్‌కు జోడిగా నటించింది. అనంతరం ప‌లు తెలుగు, త‌మిళ సినిమాల‌లో న‌టించింది. అయితే ఈ బ్యూటీకి సరైనా గుర్తింపు రాలేదు. ప్ర‌స్తుతం మేఘా ఆకాశ్ .. ‘డియ‌ర్ మేఘా’ చిత్రంలో నటిస్తోంది. తాజాగా ఈ సినిమా మోషన్ పోస్టర్ ని రానా, విజ‌య్ సేతుప‌తి, ద‌ర్శ‌కుడు గౌత‌మ్ మీన‌న్ విడుద‌ల చేశారు.

ఇందులో మేఘా ఆకాశ్ క‌న్నీరు కారుస్తూ క‌నిపించింది. సుశాంత్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో అరుణ్ అదిత్, అర్జున్ సోమ‌యాజులు ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. మేఘా ఏడుపు వెనక ఉన్న కారణం ఏంటీ ? అన్నది తెలియాలంటే డియర్ మేఘా సినిమా చూడాల్సిందే. షూటింగ్ పూర్తి కావొస్తున్న ఈ సినిమాని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.