మహేష్ తో పాట.. క్లారిటీ ఇచ్చిన మోనాల్ !

గుజరాతీ భామ మోనాల్ గజ్జర్ పలు తెలుగు సినిమాల్లో నటించింది. కానీ ఆమెకు సరైన గుర్తింపు రాలేదు. అయితే బిగ్ బాస్ 4 తర్వాత మోనాల్ పాపులారిటీ పెరిగింది. ఆమెకి ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇటీవల ‘అల్లుడు అదుర్స్‌’ చిత్రంలో ఐటెమ్‌సాంగ్‌లో మెరిసింది. తన కెరీర్‌లోనే అత్యధిక పారితోషికాన్ని అందుకుంది. ఐటమ్ భామగా మోనాల్ సరిగ్గా సరిపోయింది. ఆమెకు వరుసగా ఐటమ్ ఆఫర్లు వస్తున్నాయి.

ఈ క్రమంలో ‘సర్కారు వారి పాట’ చిత్రంలో మహేష్‌బాబుతో ఐటెమ్‌సాంగ్‌లో ఆడిపాడనుందని వార్తలు వినిపించాయి. అయితే  ఈ న్యూస్‌ పూర్తిగా అబద్దమని ‘సర్కారు వారి పాట’ చిత్రంలో తను నటించడం లేదని మోనాల్‌ గజ్జర్‌ తెలిపింది. ఈ చిత్రంలో తను ఎటువంటి ప్రత్యేకగీతం చేయడం లేదని, సోషల్‌మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవాలేనని తెలిపింది. దీంతో మహేష్ అభిమానులని మోనాల్ నిరాశపరిచినట్టయింది.