‘పిట్టకథలు’ ట్రైలర్ టాక్ 

బాలీవుడ్‌లో ప్రేక్షకాదరణ పొందిన ‘లస్ట్‌ స్టోరీస్‌’ సిరీస్‌ను తెలుగులోకి ‘పిట్టకథలు’ పేరుతో తెరకెక్కించిన విషయం తెలిసిందే. ప్రేమ, కోరిక అనే అంశాల చుట్టూ తిరిగే ఈ వెబ్ సిరీస్ ఇది. ఈ సిరీస్‌లోని నాలుగు కథలను నలుగురు దర్శకులు తరుణ్‌ భాస్కర్‌, నాగ్‌ అశ్విన్‌, సంకల్ప్‌ రెడ్డి, నందినీరెడ్డి రూపొందించారు. శ్రుతిహాసన్‌, అమలాపాల్‌, ఈషారెబ్బా, సాన్వి మేఘన ప్రధాన పాత్రల్లో నటించారు. జగపతిబాబు, సత్యదేవ్, మంచులక్ష్మి కీలకపాత్రలు పోషించారు.

ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫిక్స్‌ వేదికగా ఫిబ్రవరి 19న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సిరీస్‌ ట్రైలర్‌ను తాజాగా విడుదలైంది. ‘ఆమె మనసులో మాట అతనికి తెలుసా? తెలీదా? తెలిసి తెలియనట్టు నటిస్తున్నాడా?’ అంటూ ప్రారంభమైన ట్రైలర్  ఆకట్టుకునేలా ఉంది. బోల్డ్ కంటెంట్ వస్తున్న ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ లో మాత్రం బోల్డ్ సీన్స్ లేకుండా జాగ్రత్తపడ్డారు. తద్వారా ఫ్యామిలీ ప్రేక్షకులని దూరం కాకుండా చూసుకున్నారు.