డ్రంక్ అండ్ డ్రైవ్’లో పట్టుబడిన జబర్థస్త్ కమెడియన్

జబర్దస్త్‌ కమెడియన్‌ తన్మయి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డాడు. హైదరాబాద్ జూబ్లీహీల్స్ లో శుక్రవారం రాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో తన్మయి పట్టుబడ్డాడు. ఈవెంట ఆర్గనైజర్లతో క‌లిసి ఆయ‌న మ‌ద్యం తాగి వాహ‌నాలు న‌డుపుతున్నాడు.

ఈ తనిఖీల్లో ఐదు కార్లు, రెండు ఆటోలతో పాటు 12 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  నిబంధ‌న‌లు ఉల్లంఘించిన వారంద‌రిపై పోలీసులు కేసు నమోదు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో తెలంగాణ పోలీసులు సీరియస్ గా ఉన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపినవారు ఉగ్రవాదులతో సమానమని సీపీ సజ్జనార్ అన్న సంగతి తెలిసిందే. ఇక కరోనా టైమ్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలకి బ్రేక్ ఇచ్చిన పోలీసులు.. న్యూ ఇయర్ నుంచి మళ్లీ తనిఖీలు చేపడుతున్నారు.