చెన్నై టెస్ట్ : తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ కు 241 ఆధిక్యం


చెన్నై టెస్ట్ లో తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 337 పరుగులకు ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ కు 241 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది.   257/6 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో సోమవారం నాలుగో రోజు ఆట ప్రారంభించిన భారత్‌ మరో 80 పరుగులు చేసి చివరి నాలుగు వికెట్లు కోల్పోయింది.

వాషింగ్టన్‌ సుందర్‌ (85*; 138 బంతుల్లో 12×4, 2×6) ఒంటరి పోరాటం చేసినా అతడికి సహకరించే బ్యాట్స్‌మన్‌ కరవయ్యారు. అంతకుముందు అశ్విన్‌(31) చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 80 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇంగ్లాండ్ బౌలర్లలో బెస్‌ నాలుగు వికెట్లు తీయగా, అండర్సన్‌, ఆర్చర్‌, లీచ్‌ తలో రెండు వికెట్లు పడగొట్టారు. ఇక రెండో ఇన్నింగ్స్ లో తొలి ఓవర్ లోనే ఇంగ్లండ్ కు షాక్ తగిలింది. అశ్విన్ వేసిన తొలి ఓవర్ లో బర్న్స్ (0) అవుటయ్యాడు.