ఢిల్లీ వెళ్లిన పవన్

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్‌కల్యాణ్‌ ఢిల్లీ వెళ్లారు. భాజపా అగ్రనేతలతో పవన్ భేటీ కానున్నారు. రెండు అంశాల అజెండాతో పవన్ ఢిల్లీ వెళ్లినట్టు తెలుస్తోంది. ఇందులో ఒకటి విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశం. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఇప్పటికే పవన్‌కల్యాణ్ ఓ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. దీని గురించి కేంద్ర పెద్దలతో పవన్ మాట్లాడే అవకాశం ఉంది.

రెండో తిరుపతి ఉప ఎన్నిక. పొత్తుధర్మంలో భాగంగా జనసేన తిరుపతి సీటుని ఆశిస్తోంది. ఇప్పటికే ఏపీ భాజాపా అధ్యక్షుడు సోము వీర్రాజుతో పవన్ దీనిపై చర్చించారు. కానీ ఏకాభిప్రాయానికి రాలేదు. ఈ నేపథ్యంలో తాజా పవన్ ఢిల్లీ టూర్ ప్రాధాన్యతని సంతరించుకుంది. బీజేపీ కోసం గ్రేటర్ ఎన్నికల్లో జనసేన అర్థాంతరంగా తప్పుకున్న సంగతి తెలిసిందే. దాని ప్రతిఫలంగా తిరుపతి టికెట్ ని జనసేనకు కేటాయించబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. పవన్ ఢిల్లీ నుంచి తిరిగొచ్చాక దీనిపై క్లారిటీ రానుంది.