పాదయాత్రగా రాజీవ్‌ రైతు భరోసా దీక్ష.. వెనక !

అచ్చంపేటలో ఆదివారం కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి రాజీవ్‌ రైతు భరోసా దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లు రవి, ఎమ్మెల్యే సీతక్క తదితరులు హాజరయ్యారు. అయితే సీనియర్ నేతల కోరిక మేరకు రాజీవ్‌ రైతు భరోసా దీక్షను పాదయాత్రగా మారుస్తూ రేవంత్ నిర్ణయం తీసుకున్నారు.నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట నుంచి హైదరాబాద్‌కు ఆయన పాదయాత్రగా బయల్దేరారు.

రాజీవ్‌ రైతు భరోసా పాదయాత్ర నిర్ణయం వెనక రైతు కష్టం, దుఖం, బాధతో కూడిన ఆవేదన ఉందని రేవంత్ అన్నారు. రైతు పక్షాన కాంగ్రెస్‌ కొట్లాటలో ఇది తొలి అడుగని రేవంత్‌రెడ్డి ట్వీట్‌ చేశారు. వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని రేవంత్ రెడ్డి గతంలోనే భావించారు. కానీ ఆయనకు సీనియర్ల నుంచి సహకారం కరువైంది. అయితే అచ్చంపేట రైతు దీక్ష వేదికకు హాజరైన పార్టీ సీనియర్ నేతల కోరిక మేరకు.. అనూహ్యంగా రైతు దీక్షని పాదయాత్రగా మార్చేశారు.