పవన్-రానా కోసం వినాయక్ !

మలయాళీ సూపర్‌హిట్‌ ‘అయ్యప్పనుమ్‌ కోషియం’కు రీమేక్ లో పవన్ కల్యాణ్-రానా దగ్గుపాటి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ మాటలు అందిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో మాస్ దర్శకుడు వి.వి.వినాయక్‌ భాగస్వామ్యం కానున్నారట. ఈ సినిమాలో ఆయన ఓ అతిథి పాత్రలో కనిపించనున్నారట. ఈ మేరకు సోషల్‌మీడియాలో ప్రచారం సాగుతోంది.

మరోవైపు వి.వి.వినాయక్‌ ‘శీనయ్య’ అనే చిత్రంతో కథానాయకుడిగా తొలి అడుగు వేశారు. దీనితోపాటు ఆయన డైరెక్టర్‌గా ‘ఛత్రపతి’ బాలీవుడ్‌ రీమేక్‌ను తెరకెక్కించనున్నారు. బెల్లకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా బాలీవుడ్ ఛత్రపతి రానుంది. ఇదీగాక.. బాలయ్యతో వినాయక్ సినిమా చేయబోతున్నారనే ప్రచారం చాన్నాళ్లుగా ఉంది.