షర్మిల కొత్త పార్టీ.. రేపు కీలక సమావేశం !

తెలంగాణలో కొత్త పార్టీ పురుడుపోసుకోనుంది. వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెట్టబోతున్నట్టు ఇటీవల ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని షర్మిల ఖండించారు. ఇలాంటి ప్రచారం చేస్తే న్యాయపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. లెటెస్ట్ న్యూస్ ఏంటంటే.. ? షర్మిల పార్టీ పెట్టడం ఖాయమైంది. ఈ నెల 9న ఆమె పార్టీని ప్రకటించనున్నారు. దీని గురించి చర్చించేందుకు రేపు లోటస్ పాండ్ లో కీలక సమావేశం నిర్వహించబోతున్నట్టు సమాచారమ్.

ఇక పార్టీని ప్రకటించిన వెంటనే చేవెళ్ల నుంచి షర్మిల పాదయాత్ర చేయబోతున్నట్టు తెలుస్తోంది. చేవెళ్ల సెంటిమెంట్ ఎందుకంటేచేవెళ్ల నియోజకవర్గానికి వైఎస్ కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది. చేవెళ్ల నుంచి 2003లో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఇక్కడి నుంచే పాదయాత్ర ప్రారంభించారు. ఉమ్మడి ఏపీలో ఆయన 1,467 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. పాదయాత్రతో రాజశేఖర్‌రెడ్డికి జనాదరణ లభించడమే కాకుండా ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ సెంటిమెంట్ తోనే షర్మిల చేవేళ్లని ఎంచుకున్నట్టు తెలుస్తోంది.