సీఎం కేసీఆర్’ని తొలగించండి.. గవర్నర్’కు ఫిర్యాదులు ! 

సీఎం కేసీఆర్ ను తొలగించాలంటూ గవర్నర్ తమిళిసైకు ఫిర్యాదులు అందుతున్నాయ్. ఇప్పటికే భాజాపా ఎంపీ ధర్మపురి అరవింద్, కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి గవర్నర్ కు లేఖలు రాశారు. సీఎం పదవిని కాలి చెప్పుతో పోల్చిన కేసీఆర్‌ను తక్షణం పదవి నుండి తొలగించాలని వీరు కోరారు.

ఆదివారం జరిగిన తెరాస కార్యవర్గ సమావేశంలో సీఎం కేసీఆర్ సుధీర్ఘంగా మాట్లాడిన సంగతి తెలిసిందే. మంత్రి కేటీఆర్ కు ముఖ్యమంత్రి బాధ్యతలంటూ జరుగుతున్న ప్రచారంపై కేసీఆర్ ఫైర్ అయ్యారు. తాను బాగానే ఉన్నా. ఇంకో 10యేళ్లు సీఎం అన్నారు. ఈ క్రమంలో సీఎం పోస్ట్ నా ఎడమకాలి గోటితో సమానమన్నారు. ఇప్పుడీ.. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయ్. రాజ్యాంగబద్దమైన పదవిని కేసీఆర్ అవమానించారు. ఆయన వ్యాఖ్యలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష నేతలు కోరుతున్నారు. మరీ.. ఈ ఫిర్యాదులపై గవర్నర్ రియాక్షన్ ఏవిధంగా ఉండనుంది అన్నది చూడాలి.