షర్మిల ఎవరు వదిలిన బాణం ?

వైఎస్ షర్మిల ఒకప్పుడు వైఎస్ జగన్ వదిలిన బాణం. అన్న వదిలిన బాణాన్ని అంటూ ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తిరిగింది షర్మిల. అన్న జైలుకెళ్లిన సమయంలో ప్రజల్లో వైఎస్ సెంటిమెంట్ ని చావకుండా చూసింది. అయితే ఇప్పుడీ.. ఈ బాణాన్ని జగనన్న పట్టించుకోవడం లేదని.. తన దారి తాను చూసుకుంటోంది. ఎటు వెళ్లాలో.. ఏం చేయాలో తెలియక తెలంగాణలోకి తీసుకొచ్చింది. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకోస్తానంటోంది. అయితే తెలంగాణపై వదిలిన ఈ బాణం వెనక ఉన్నది ఎవరు ? అనే చర్చ జరుగుతోంది.

భాజాపా వదిలిన బాణమే షర్మిల అని కాంగ్రెస్ నేతలు, విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ రెడ్డిల అడ్ద. గతంలోనూ.. ఇప్పుడు కూడా తెలంగాణ కాంగ్రెస్ లో రెడ్డిలదే హవా. వారిని కాంగ్రెస్ కు దూరం చేయడంలో భాగంగా అమిత్ షా షర్మిల బాణాన్ని వదిలారనే ప్రచారం జరుగుతోంది. మరికొందరు అయితే.. అమిత్ షా, కేసీఆర్ కలిసి షర్మిల బాణాన్ని వదిలారని చెప్పుకుంటున్నారు. సీఎం కేసీఆర్ లక్ష్యం కూడా అదే.. రెడ్డి, క్రిస్టియన్ ఓటు బ్యాంకుని కాంగ్రెస్ కి దూరం చేయాలన్నది ప్లాన్ అని చెప్పుకుంటున్నారు. తనకి పడని ఓట్లని ప్రత్యర్థి పార్టీకి పడకుండా చేయడంలో భాగంగా జగనన్న బాణాన్ని వదిలారని మాత్రం స్పష్టంగా తెలుస్తోంది.