మళ్లీ తెరపైకి దిశ కేసు

దిశ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. హైకోర్టులో ఉన్న కేసును వెనక్కి తీసుకోవాలని పలువురు ప్రలోభ పెడుతున్నారంటూ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన నలుగురు నిందితుల కుటుంబ సభ్యులు దిశ కమిషన్‌ను ఆశ్రయించారు. హైకోర్టులో కేసు వెనక్కి తీసుకుంటే ఒక్కో కుటుంబానికి రూ. 25 లక్షలు ఇస్తామంటూ ప్రలోభం పెట్టినట్లు తెలిపారు.

చెన్నకేశవులు తండ్రి కూర్మయ్య ప్రమాదం కేసులో అనుమనాలున్నాయన్న చెన్నకేశవులు తల్లి అన్నారు.  దిశ కేసులో కీలక విషయాలు బయట పెడతానని చెప్పడంతో..కూర్మయ్యకు గుర్తు తెలియని వ్యక్తులు యాక్సిడెంట్ చేశారని ఆమె ఆరోపించారు. లారీ ఓనర్ శ్రీనివాస్‌రెడ్డిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.