భారత్’తో టీ20 సిరీస్ ఆడబోతున్న ఇంగ్లండ్ జట్టు.. ఇదే !

భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ప్రస్తుతం టెస్ట్ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. 4 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ చెన్నై వేదికగా జరిగింది. ఈ టెస్టులో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. ఇక టెస్ట్ సిరీస్ తర్వాత అహ్మదాబాద్ వేదికగా 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ జరగనుంది. తాజాగా ఈ సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టుని ప్రకటించారు. కెప్టెన్ గా ఇయాన్ మోర్గాన్ వ్యవహరించనున్నారు.

ఇంగ్లండ్ జట్టు : ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), జాసన్ రాయ్, మొయిన్ అలీ, డేవిడ్ మలాన్, లియామ్ లివింగ్ స్టోన్, జానీ బెయిర్ స్టో, జోస్ బట్లర్, బెన్ స్టోక్స్, శామ్ కరన్, క్రిస్ జోర్డాన్, టామ్ కరన్, జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్, శామ్ బిల్లింగ్స్, అదిల్ రషీద్, రీస్ టాప్లే.

రిజర్వ్ ఆటగాళ్లు : జేక్ బాల్, మాట్ పార్కిన్సన్