ప్రభాస్ తర్వాత తారక్’తోనే.. !

కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా చేయనున్నాడనే ప్రచారం జరిగింది. అయితే తారక్ కంటే ముందే ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ సినిమా ఫిక్స్ అయింది. వీరి కాంబోలో ‘సలార్’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. దీంతో ప్రశాంత్ నీల్ తో తారక్ సినిమా ఉండదేమో అనే అనుమానాలు నెలకొన్నాయి. తాజాగా తారక్-ప్రశాంత్ నీల్ సినిమాపై మైత్రీ మూవీస్ నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు.

మైత్రీ మూవీస్ నిర్మించిన ‘ఉప్పెన’ సినిమా రేపు (ఫిబ్రవరి 12) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న మైత్రీ నిర్మాతలు.. తారక్-ప్రశాంత్ నీల్ సినిమాపై స్పందించారు. సలార్ సినిమా తర్వాత తారక్ సినిమానే ఉండనుందని తెలిపారు. అంతేకాదు.. గోపీచంద్ మలినేని-బాలయ్య సినిమాని కూడా ఖరారు చేశారు. ఇదో యాక్షన్ ఎంటర్ టైనర్. అద్భుతంగా ఉండనుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఇవ్వనున్నామని తెలిపారు.

మైత్రీ నిర్మాతలు ఇచ్చిన క్లారిటీతో నందమూరి అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మైత్రీ బ్యానర్ ఒకే టైమ్ లో ఇటు బాబాయ్ బాలయ్య, అటు అబ్బాయ్ తారక్ తో సినిమాలు చేయనుంది అన్నమాట. ఇక బాబీ-మెగాస్టార్ సినిమా గురించి కూడా మైత్రీ నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా అద్భుతంగా ఉండనుంది. గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, ముఠా మేస్త్రీ.. రేంజ్ లో బాబీ-చిరు సినిమా ఉండనుంది. కంప్లీట్ ఎంటర్ టైనర్. మెగా అబిమానులకి పండగేనని చెప్పుకొచ్చారు.