ప్రేమికులకి ‘లవ్ స్టోరీ’ గిఫ్ట్ ఏంటంటే ?


నాగచైతన్య-సాయి పల్లవిల ‘లవ్ స్టోరీ’ని తెరకెక్కించారు దర్శకుడు సుకుమార్. దాన్ని ప్రేమికుల రోజు (ఫిబ్రవరి 14) రిలీజ్ చేస్తారని అనుకున్నారు. కానీ లవ స్టోరీ రిలీక్ కాస్త ఏప్రిల్ 16కి వెళ్లింది. అయితే ప్రేమికులని నిరాశపరచకుండా ఫిబ్రవరి 14న ఓ గిఫ్ట్ ని ప్లాన్ చేశారు శేఖర్ కమ్ముల. ఆ రోజున లవ్ స్టోరీ నుంచి #NeeChitramChoosi పాటని విడుదల చేయనున్నారు.

ప్రతి యేడాది ప్రేమికల రోజున అభిమానులకి గిఫ్ట్ ఇవ్వడం నాగ చైతన్యకు అలవాటు. 2019 ఫిబ్రవరి 14న ‘మజిలీ’ టీజర్ ని రిలీజ్ చేశారు. ఇక 2020 ఫిబ్రవరి 14న  #AyPillamusicalpreview ని విడుదల చేశారు. ఇక ఈ యేడాది ప్రేమికుల రోజున #NeeChitramChoosi పాటని బహుమతిగా ఇవ్వనున్నారు.

ఇక ‘లవ్ స్టోరీ’ శేఖర్ కమ్ముల మార్క్ సినిమా. అయితే క్లైమాక్స్ విషాదాంతంగా ఉంటుందని సమాచారమ్. ఇందులో ఆంధ్రా అమ్మాయిగా సాయి పల్లవి, తెలంగాణ కుర్రాడిగా సాయి పల్లవి కనిపిస్తారని తెలుస్తోంది. శేఖర్ కమ్ముల ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్ని దోచేసింది సాయి పల్లవి. ఆయన దర్శకత్వంలో సాయి పల్లవి నటిస్తున్న రెండో సినిమా ఇది. లవ్ స్టోరీతో రెండోసారి తెలుగు ప్రేక్షకులని సాయి పల్లవి ఫిదా చేయడం ఖాయం అంటున్నారు.